BREAKING: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం
గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘటన
On
20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం
గద్వాల/ఫోకస్ న్యూస్: గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఇటిక్యాలపాడు సమీపంలో బస్సు గుంతలో పడి అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Tags:
